Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కౌతా మార్కండేయ శాస్త్రి 22-09-1946 న శ్రీమతి కౌతా శ్యామలాంబ, సుబ్బారావు, దంపతులకు గుంటూరు నందు జన్మించిరి. హిందూ కళాశాల గుంటూరులో గణితము, సైన్లలో పట్టభద్రులయిరి. సంస్కృతమును కళాశాలలో ప్రత్యేకముగా చదివిరి. విశాఖపట్నంలో ఎం.ఎ. (గణితము) చదివిరి. 26-04-1970 న శ్రీమతి కొత్తపల్లి కనకదుర్గాంబ, రామచంద్రరావుల తృతీయ పుత్రిక శుభలక్ష్మిని వివాహము చేసుకొనిరి. ఆధ్యాత్మిక ఉన్నతికై ఆసేతు హిమాచల పర్యంతము విస్తృతముగా పత్నిసమేతంగా పర్యటించిరి. స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీ సాయిబాబా వారి దివ్యమైన సలహా మీద శ్రీశ్రీ యోగానందస్వామి వారి ప్రీతిపాత్ర శిష్యులయ్యిం. ధ్యానములొ దంపతులిద్దరికి ఎన్నో మారులు సత్ గురువుల, సప్తర్షుల, దివ్యపురుషుల మరియు దైవదర్శనములు అయినది. ఈ విషయము బాహాటంగా చర్చించుటకు ఇష్టపడరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ విరమణ తదుపరి 09-10-2006 న తమ స్వంతఖర్చుతో క్రియాయోగ ధ్యానమందిరమును 30,0090 (Kriya Yoga Dhyana Mandir, D.No. 76, Devi Nagar, RK Puram Gate, Secunderabad -500056). ఎంతో మందిని క్రియాయోగ సుశిక్షితులను చేసిరి. ఈ మందిరములొ ధ్యానము చేసిన పెక్కుమంది, భయంకరమైన రుగ్మతుల నుండి విముక్తి పొందిరి. ఆత్మసాక్షాత్కారము. దివ్యదర్శనములు అయినవి. ఈ దంపతుల కుమార్తె శ్రీమతి వేమూరి శ్యామల, అల్లుడు మహేష్, మనుమరాలు ఋషి, మనుమడు రుద్ర అందరూ క్రియాయోగ దీక్షపరులే, శ్రీశాస్త్రిగారు పెక్కు ఆధ్యాత్మిక గ్రంథములు అంగ్లం, హింది మరియు తెలుగు భాషలలో శ్రీశ్రీ మహావతార్ బాబాజీ దివ్యానుగ్రహముతో రచించిరి.