Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

 నేటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగ ఉత్పత్తి ప్రక్రియ చాలా వరకు సన్న చిన్నకారు రైతుల పై ఆధారపడి వుంది. ఇంకా చెప్పాలంటే అత్యధికంగా గల కౌలు రైతుల పైనే ఆధారపడి వుందని చెప్పడం సబబు. అందుకని కౌలు రైతులు శ్రేయస్సు పరిరక్షణ చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. వీరికి సంస్థాగత ఋణాలు వారి పంటలకు గిట్టు బాటు ధరలు కౌలు విధానాలు సరళీకరణ చేయబడడం కౌలు కాల పరిమితి దీర్ఘ కాలం కొనసాగించగలిగినప్పుడే వారు పంట సాగుపై చిన్న చిన్న పెట్టుబడులు పెట్టగలిగి అధిక ఉత్పత్తి సాధించగలరు. అప్పుడే వారి ఆదాయాలు పెరిగి అధిక ఋణ భారం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియలో వారు స్వయం సమృద్ధి సాధించగలరు. ఫలితంగా భారతదేశపు గ్రామాలను నేడు కుది పేస్తున్న రైతుల ఆత్మహత్యలు నివారింపబడతాయి. అప్పుడు గ్రామీణ భారతం స్థిర సమ్మిళిత ఆర్థికాభివృద్ధి పథంలో పయనించి వేగంగా పెరుగుతున్న దేశ అధిక జనాభాకు కావాల్సిన ఆహార భద్రతను కల్పించగలరు. 

                                                                                                        - ఆచార్య చుంచు సుబ్రహ్మణ్యం