Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఇప్పటి మన సమాజ స్థితి అర్థం కావాలంటే...గత కాలపు చారిత్రక సత్యం నిర్మాణాత్మకంగా అంచనా వేయవచ్చు. తప్పనిసరిగా తెలిసి ఉండాలి. అలా తెలుసుకొన్నప్పుడే భవిష్యత్తును కూడా
ముఖ్యంగా నేను పుట్టింది 1952 లో, అప్పటికీ ఇప్పటికీ ప్రతి రంగంలోనూ అని మార్పులో అన్నీ వివరించడం అసాధ్యం. -
ప్రస్తుతం ఎనుములను గురించిన ప్రస్థావన కాబట్టి 1965 తరువాత సంకరజాతి అవులు తయారై, 10-15 లీటర్లను పూటకు ఇస్తూ పాల ఉత్పత్తి వాటి ద్వారానే ఎక్కువగా జరుగుతూ ఉంది.
నిజానికి దక్షిణ భారతదేశం ఎనుములకు ప్రసిద్ధి. గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ప్రాంతాల్లో పూర్వం నీరు ఎక్కువగా ప్రవహిస్తూ బురదగా ఉండడంతో అక్కడ ఇవి విరివిగా వృద్ధి చెందడానికి కారణమయ్యింది. (ఎనుములు, పందులు, ఏనుగుల చర్మాలకు స్వేదగ్రంథులు ఉండవు కాబట్టి అవి వేడిని భరించవు. నీటిలోను బురదలోనూ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి). కాళ్ళు దిగబడే బురద నేలల్లో వ్యవసాయానికి దున్నపోతులనే వాడేవారు.
అయితే అప్పుడు ఆవులు లేవా? అంటే! ఉండేవి. అవి పొట్టిజాతులు. అవి ఇచ్చేపాలు వాటి దూడలకే సరిపోయేవి. మహా అయితే లీటరో అరలీటరో మాత్రమే ఇవ్వగలిగేవి. కాలక్రమంలో మైసూరు, హలికేరి వంటి పెద్ద జాతులు వృద్ధి అయిన తరువాత ప్రజలు ఆవులను పెంచడం కేవలం కుర్ర దూడలను వ్యవసాయం కోసం సాధనాలుగా పొందడానికి మాత్రమే అలవాటు చేసుకొన్నారు. పాల ఉత్పత్తి బర్రెద్వారానే జరిగే