నదికి తన గమ్యం తెలియకకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందని, అలాగే ప్రతి మనిషి తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చిన సాగిపోవాలని గమ్యం కథ చెబుతుంది.
జీవితం అన్నది పులపాన్పు కాదని, కష్టాల కడలి అనీ అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం.
మనిషికి నిరాశ పనికిరాదు, ఆశాజ్యోతి చీకట్లను పారద్రోలుతుంది.
ఈ కథ సంపుటిలోని 22 కథలు మనుషుల సమగ్ర జీవనయానాన్ని ఆవిష్కరిస్తాయి. సమస్యల్ని ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలో చెప్పకనే చెబుతాయి. మనుషులు నిజాయితీగా బ్రతకాలనీ, నైతిక విలువలు పాటించాలని నిర్దేశిస్తాయి......
- గన్నవరపు నరసింహమూర్తి