నేను ఒకనాడు నా తల్లినేలకు బయలెక్కితి. "రైలు బండి ఏక్కేస్తిని, రాత్రంతా ప్రయాణం, ఒకటే నిద్రపోతా ఉంటి. దిడిర్న మెలుకవ వచ్చే. రైలు పాకాల జంక్షన్ కు చేరే. ఇడ్లి, వడ, దోసె, పొంగల్ అంటూ ఫలహారాలు ఆమ్మేవాళ్లు ఒకపక్క, టి, కాఫీ, పేపర్ అమ్మేవాళ్లు మరోపక్క . ఎక్కడ చూసినా తెలుగు సద్దే! నాకు ఎక్కడికో దేవలోకానికి వచ్చినట్లు ఉనింది. మా పెద్దవాండ్లు ఉండిన నేలమీద కాలిడుతూనే ఆ "మాన్ వాసన" కు ఎదో తెలియని సంతోషం. నా కండ్లలో నీరు
తెలుగుమాట రుచి తగిలితే నిండా బాగుండు.
తెలుగునాడు తెలుగైతే నిండనిండా బాగుండు.
తెలుగుదనాన్ని ఇక్కడి తెలుగువాళ్లతో మాటాడినపుడు నేను రుచి చూస్తున్నాను.
మనమంతా తెలుగుతల్లి బిడ్డలం.
ఎదో కాలవాసన ఎప్పుడో
"మేము " ఈ పక్కలో ఉండిపోతిమి,
"వీరు" ఆ పక్కలో ఉండిపోతిరి.
"మనం" ఉండేది ఎక్కడైనా
మనం మాట్లాడే "తెలుగుభాషను" విడకూడదు".