జగమంత కుటుంబం నా సప్తమ కథాసంకలనం. 1963 లో నా మొదటి కథ ఆంధ్రప్రభ వార పత్రికలో వచ్చినప్పటి నుండీ ఇప్పటివరకు రెండు వందల పైన కథలు తెలుగుదేశంలోని ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
1966 లో నా మొదటి నవలిక ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది. మరో మూడు నవలలు స్వాతి మాసపత్రికలో అనుబంధంగా వచ్చాయి.
నా మొదటి కథా సంకలనం "ఆశల మెట్లు" ప్రముఖ విమర్శకులు శ్రీ వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు ఆవిష్కరించారు. చిన్న కథారచనని కరతలామలకం చేసుకున్నానని అభినందించారు.
- డా. కె. మీరాబాయి