"అగ్ని కిరీటపు ధగధగలు అండర్ గ్రౌండ్ లో కూడా ఆరిపోయినపుడే కవిత పుడుతుంది .అటువంటి కవిత యిటీవల ":ప్రభాతకాంతిని" అద్దుకొని ఆవిర్భవిస్తోంది, తెలుగు కవిత్వంలో ఒక కొత్త అధ్యాయంగా , సమష్టిచైతన్యం తన చైతన్యంగా."
" మీ కవితకు కునుకు వదిలింది. సుప్రభాతం. గంపలు ఎదురుచూస్తున్నాయి నింపమని." "దోసిలిపట్టి నిలుచున్న దిగంతం" అవును, దోసిలిపట్టి నిలుచున్నది పాఠకలోకం.
"బ్రహ్మాండఖండానికి మూత" తీశారు, బంగారు కలల పై మూత.