Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹75

శ్రీమధన్వంతరయే నమః

ఉపోద్ఘాతము

శ్రీగురుభ్యోనమః ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుస్రుత, వాగ్భాటులనే పేర్లుగల ఋషులు ముగ్గురూ త్రిమూర్తుల వంటివారు. వీరు ఉద్దంద్రాలను వ్రాసినారు. జననూ చరకుడు రచించిన గ్రంధంలో చికిత్సాస్థానము ప్రసిద్ధికెక్కినది. వాగ్భటుడు వ్రాసిన పుస్తకంలో సూత్రస్థానము పేరు పొందింది. సుస్రుతుడు లిఖించిన కబ్బంలో శరీరస్థానము ప్రసిద్ధి చెందింది. అష్టాంగ విస్తృతమైన మూడు పుస్తకాల్లో ఒక్క భాగమే వినియోగపడి తక్కిన భాగాలు పొల్లుగింజల వలె నిరర్ధకమైనందుకు ఆ కవులు పొందే హృదయవేదన వారికే తెలియును.

చరకసంహితను గురించి అనేకమంది అనేకవిధాలుగా చెప్పుచు -మన్నారు. ఆ కావ్యం వ్రాసింది చరకుడుకాదని ఎవరో వ్రాసిన గ్రంధం

దారిలో పడి దొరికినదాన్ని సొంతం చేసుకుని దానికి తన పేరుని తగిలించా డని కొందరి అభిప్రాయము. గ్రంథ చౌర్యం చేసి పైవిధంగానే చేసాడని కొందరు, సూత్రభాష్యం వ్రాసిన పతంజలి ఆయుర్వేద సంహితకు చరక మనే పేరును తానే స్వయంగా పెట్టాడని వైద్యోత్తములు చెప్పుచున్నారు. | ఈవిషయంలో నా అభిప్రాయం ఇట్లున్నది. మానవుల దేహానికి మూలాధారము నుండి శిరస్సువరకు వ్యాపించియున్న వెన్నెముక అనే ఫిడనాడికి తోరణస్థంభం, బ్రహ్మదండి, నాగమనే పేర్లు గలవు. శాస్త్రజ్ఞులు అన్ని వెదురుబొంగుతో పోల్చిరి. దానికి కారణమే మన్నచో బొంగునకు కలుపులు, కణుపుల స్థానమున సన్నని చిలువలు కలిగియున్న విధంగా మూలాధారాది షట్చక్రాలు అమర్చబడి యుండెను. ఈ విధమైన వెన్నెముక యందు స్థూల, సూక్ష్మరూప భేదాలతో ఉన్న 3,50,000,00 సంఖ్యగల నాడులు నాభిచక్రానికి పైభాగమున ఉండే భూమధ్యస్తానము వరకు, సహస్రారమనే తో ప్రసారయంత్రము వరకూ, కొన్ని నాడుల ముఖాలు................