నా అభిరుచి వ్రాసి తీరాలన్న తపనే "నాటక" రచనకు పురిగొల్పింది. సృజనాత్మకంగా పాత్రల నైజాన్ని మేళవించి విశ్లేషించాలనే అభిలాష ఉండేది. భావోద్రేకాల ముస్తిష్కంలో గోల పెట్టబట్టే అనేక "రచన" లు చేయగల్గాను. అనేక అవార్డులు అందుకున్నాను. నేను స్వయంగా నటించి, దర్శకత్వం వహించాను. సుప్రీం కోర్ట్ జస్టిస్ గౌ|| పాత్రో గారిచే "బిరకిషోర్ రాయ్" అవార్డు పొందాను.
"నగ్న శిల్పం" నాటికగా 1992 లో రచించినది . నాటకంగా 2019 లో రూపుదిద్దాను. రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల్లోను, వివిధ పరిషత్తులకు ఎంపిక కాబడి వివిధ కళా సంస్థలచే ప్రదర్శింపబడింది "నగ్న శిల్పం" నాటిక. కళాభారతి , లలిత కళాతోరణం, సత్తుపల్లి వారే 60 ప్రదర్శనలిచ్చారు. ఉషోదయ కళాపరిషత్ వారు 35 ప్రదర్శనలిచ్చారు. బెంగళూరు లోని తెలుగు కళాకారులు, ప్రవాసాంధ్రులు కలిపి ఇప్పటి వరకు 99 ప్రదర్శనలు యివ్వటం జరిగింది.