Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹130

ముందు మాట

ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేకించి కరవు పీడిత రాయలసీమ నీటి సమస్యలపైన, ఉపదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పొందుపరచిన అంశాలు - ప్రత్యేక ఆ తదితరాలపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉన్నదని మా రచనలు, సామాజిక మాధ్యమంలో మా పోస్టులు వెల్లడిస్తున్నాయి.

శంకరయ్య గారు వివిధ దినపత్రికల్లో వ్రాసిన వ్యాసాలను ఒక పుస్తక రూపంలో సమరావాలన్న ఆలోచన ఉన్నదని నాకు తెలియజేసినప్పుడు మంచి ఆలోచన అని

చెప్పాను.

శంకరయ్య గారికి పాత్రికేయ వృత్తిలో దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ప్రగతిశీల భావాలకు దిక్చూచి అయిన విశాలాంధ్ర దినపత్రికలో సబ్ ఎడిటర్ | బాధ్యతలు నిర్వహించాను. అలా “విశాలాంధ్ర” మా మధ్య అనుబంధాన్ని ఏర్పరచింది. 12 ఏళ్ళకు పైగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో పాత్రికేయ వృత్తిలో కొనసాగారు.

గడచిన ఏడాదిగా కృష్ణా - గోదావరి నదీ జలాల వినియోగం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పొడచూపుతున్న వివాదాల పైన, రాయలసీమ ప్రాంత నీటి హక్కులు | ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతూ అనేక వ్యాసాలు వ్రాశారు. అలాగే ప్రత్యేక తరగతి హోదా, వగైరా అంశాలపై కూడా వ్యాసాలు వ్రాశారు.

సంపూర్ణ అవగాహనతో, గణాంకాలతో సహా సమాచారాన్ని పొందుపరచి వారు వ్రాసిన వ్యాసాలు చాలా విలువైనవి. ప్రజలు, ప్రత్యేకించి యువత చదవాల్సివుంది. అందుబాటులో ఉంటే ప్రజలు, ప్రత్యేకించి ఉద్యమకారుల చేతుల్లో ఒక ఆయుధంగా వుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎనిమిది పదుల వయస్సులో శంకరయ్య గారు సమాజానికి చేస్తున్న -కృషికి హృదయపూర్వకంగా అభివందనాలు తెలియజేస్తున్నా.............