Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

           బ్రహ్మముహూర్త సమయంలో.... పురాణకాలంలో ఇంద్రాది దేవతలు నివశించిన దివ్య నగరం 'అమరావతి' లో.... ఈనాటి చరిత్రకకాలంలో... ఆనాటి తెల్లవారుజామున.... పవిత్ర కృష్ణవేణీ నదీ జలాల్లో పవిత్ర స్థానం ఆచరిస్తూ... అలా... ఉమాసుతుడు గణపతిని భక్తి ప్రపత్తులతో ప్రార్థించారు పరమా నందయ్యగారు. 

           అది అమరావతి రాజ్యం. ఆ అమరావతి రాజ్యానికి రాజధాని ధరణికోట. రాజ్యాధిపతి నరేంద్రుడు మహాశివభక్తుడు, యువకుడు, అవివాహితుడు. 

           ఒకప్పుడు తారకాసురుడి చేత స్వర్గలోకం నుంచి తరిమికొట్టబడిన ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం ఈ 'అమరావతి' నగరాన్ని నిర్మించుకొని కొంతకాలం ఇక్కడ నివశించారని ప్రతీతి. ఇది స్థలపురాణం. 

                                                                                                       - తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు