ప్రవీణ్ గా పిలువబడే రచయిత పూర్తిపేరు " వెంకట విశ్వoభర సుబ్రమణ్య సీతారామరాజు" వీరి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తాలూకా చిత్ఫలపాలం అయినప్పటికీ బాల్యం, విద్యాభ్యాసం అంతా విజయనగరం జిల్లా అలమండ గ్రామంలో మాతామహుల ఇంటసాగింది. M.sc పట్టభద్రుడైన ఈయన పలు కళాశాలల్లో అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే సాహిత్యం పట్ల మక్కువతో రచనారంగంలోకి అడుగు పెట్టారు.