Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

                                పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారు (1929-2011) ఆంధ్రవిశ్వ విద్యాలయంలో పాతికేళ్లకు పైగా తత్త్వశాస్త్రం బోధించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, యుజిసి వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్నారు. సమకాలీన భారతీయ తత్త్వవేత్తలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే దార్శనికుడాయన. భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కృతి, మతం - ముఖ్యంగా వేదాంతంపై ఆయన రచనలు సూక్ష్మ విశ్లేషణను అందిస్తూ, నూతన అధ్యయనాలను ప్రదర్శిస్తాయి.

                  ఇంగ్లీషులోను, తెలుగులోను, హిందీలోను తత్త్వశాస్త్రంపై అనేక గ్రంథాలను రచించారు, అనువదించారు, సంపాదకత్వం వహించారు.