ఆది నారాయణుని అవతారమయిన హయగ్రీవ స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు. వేదములు అనంతములు, అపౌరుషేయములు. అట్టి వేదములను యోగ దృష్టితో దర్శించి, దివ్యహక్కులతో రూపమునిచ్చి, మానవాళికి అందించిన మహనీయులు- సనాతన ఋషులు. ఋషులు వారివారి తపశ్శక్తి, యోగశక్త్యాను సారం దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులుగా విభజించబడినారు. వీరిలో కల్పాంతము వరకు నక్షత్ర, మండలమున విరాజిల్లు సప్తర్షులు అగ్రగణ్యులు.
వారు వారి అమోఘమయిన విభిన్నమయిన జీవన విధానములచే సర్వమానవాళికీ ఆదర్శప్రాయులయినారు.
- నిష్టల దుర్గామల్లికార్జున శర్మ