మనం..... తెలుగు వాళ్ళం .... ఎంతటి కథనైనా, మూడు ముక్కల్లో చెప్పగల సమర్థులం. 'కట్టే..... కొట్టే.... తెచ్చే.....' అని మూడు ముక్కల్లో రామాయణమంతా చెప్పగలం, ఇంతింతగా విస్తరించి మదాంధ్రమయాణాలు, రామాయణ కల్పవృక్షాలను రాయగలం. నిలేసి, రామాయణ విషవృక్షాలుగా తిరగ రాయగల నిపుణులం. సంపూర్ణరామాయణం నుంచి ఉత్తర రామాయణం చెపుతూ చెపుతూ, మధ్యే మధ్యే 'శంబూకవధ' ను సాధించగలం. 'సీత జ్యోస్యం ' చెప్పగలం. 'మండోదరి శబ్దం' నర్తించగలం. 'ఊర్మిళ నిద్ర' గురించి పదాలు కట్టగలం. కృతులుగా కీర్తనలుగా పాడగలం. చెక్కభజనలతో కోలాటాలు వేయగలం.
- కోసూరు రత్నం